ఎల్బీనగర్ జంక్షన్ లో ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

-

ఎల్బీనగర్ జంక్షన్ లో ఫ్లైఓవర్ ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. 32 కోట్లతో చేపట్టిన ఎల్బీనగర్ ఆర్హెచ్ఎస్ ఫ్లైఓవర్ ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఎస్ఆర్డిపి లో 19వ ప్రాజెక్టు అయిన ఆర్హెచ్ఎస్ ఫ్లై ఓవర్ ను 760 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభంతో ఆంధ్ర ప్రదేశ్, ఖమ్మం, నల్గొండ, ఉమ్మడి జిల్లాల నుంచి హైదరాబాద్ కి వచ్చే వాహనాలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు.

అలాగే ఎల్బీనగర్ జంక్షన్ మీదుగా ఎల్బీనగర్ లోని హయత్ నగర్, వనస్థలిపురం ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు అవాంతరాలు లేని ప్రయాణం అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ఫ్లై ఓవర్ వల్ల ఎల్బీనగర్ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణ సమయం కూడా ఆదా కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news