కేసీఆర్ ప్రధాని కావాలని సమ్మక్క-సారలమ్మ తల్లులను కోరుకున్న- మంత్రి మల్లారెడ్డి

-

మా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి దేశానికి ప్రధాన మంత్రి కావాలని వనదేవతలను సమ్మక్క-సారలమ్మ తల్లులను కోరుకుంటున్నట్లు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కోరుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటి దాకా 10 ఏళ్ల నుంచి నేను కోరకున్న కోరికలు సక్సెస్ అయ్యానని.. కేవలం ఇప్పడు ఒకే కోరిక కోరానని సీఎం కేసీఆర్ని ప్రైమ్ మినిస్టర్ చేయాలని కోరకున్నానని అన్నారు. ఒక్క సారి ప్రైమ్ మినిస్టర్ ని చేస్తే.. భారత దేశం సస్యశ్యామలం అవుతుందని.. అందరికి తాగు, సాగు నీరు వస్తాయి, ఆసరా ఫింఛన్లు వస్తాయని..కరెంట్ వస్తుంది.. గురుకుల పాఠశాలలు వస్తాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయని.. మన తెలంగాణ ఎలా అభివ్రుద్ధి చెందిందో.. భారత దేశంలో కూడా రెండేళ్లలో చేసి చూపిస్తారని.. నా మొక్కును వన దేవతలు తీరుస్తారని ఆయన విశ్వాసం వ్యక్త చేశారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ మేడారంలో తల్లులను దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్ జాతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news