చంద్రబాబు కు సవాల్ విసిరిన మంత్రి పెద్దిరెడ్డి

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. టీడీపీ అధికారంలో ఉన్న 2014 నుంచి 2019 దాకా రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్లో మేనిఫెస్టో తొలగించిన చరిత్ర టిడిపిదే అని మండిపడ్డారు. చంద్రబాబు మాయ మాటలు నమ్మే స్థితిలో జనాలు లేరని, చంద్రబాబుని జనం ఎప్పుడో ఇంటికి పంపారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని మంత్రి కొనియాడారు.

బస్సు యాత్ర కు అనూహ్య స్పందన వస్తుందని తెలిపారు. బస్సుయాత్ర టిడిపి మహానాడుకి పోటీ కాదని స్పష్టం చేశారు. చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీలో సామాజిక విప్లవం వచ్చిందన్నారు.అన్ని కులాలకు పదవులు దక్కడం దేశంలో ఎక్కడా లేదన్న పెద్దిరెడ్డి..ముఖ్యమంత్రి వైయస్ జగన్ వల్లే ఇదంతా సాధ్యం అయ్యిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news