మంత్రి పువ్వాడ అజయ్ ఓ సైకో: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి..

-

తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పువ్వాడ ఒక సైకో అని అభివర్ణించారు.అతడిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.మూడేళ్లుగా ఖమ్మం లో పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని, పువ్వాడ కొందరు పోలీసులు గులాంగిరి చేస్తున్నారని ఆరోపించారు.కెసిఆర్, కేటీఆర్ లను ఆకట్టుకునేందుకు పువ్వాడ అతిగా ప్రవర్తిస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు.ఖమ్మంలోో బిజెపి కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే.ఈ ఆత్మహత్యకు కారకుడు పువ్వాడేనంటూ బిజెపి నేతలు మండిపడుతున్నారు.

jaggareddy | జగ్గారెడ్డి
jaggareddy | జగ్గారెడ్డి

ఈ అంశంపై జగ్గారెడ్డి స్పందిస్తూ సాయి గణేష్ నుంచి పోలీసులు ఎందుకు వాంగ్మూలం తీసుకోలేదో చెప్పాలని నిలదీశారు.కావాలనే పోలీసులు వాంగ్మూలం తీసుకోలేదని అర్థమవుతుందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన మంత్రి పువ్వాడ ఇదే తరహాలో వేధింపులకు పాల్పడ్డారని జగ్గారెడ్డిి పేర్కొన్నారు.సాయి గణేష్ కేసులో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి నిందితులకు శిక్ష పడేలా చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news