కుప్పంలో ఓడించినా బుద్ధి రాలేదు – మంత్రి రోజా

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు పర్యాటక శాఖ మంత్రి రోజా. మూడు ఎమ్మెల్సీ స్థానాలలో గెలవగానే మళ్ళీ అధికారంలోకి వచ్చేది తామేనంటూ టిడిపి నేతలు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. 2019లో ఎన్నికలు జరిగినప్పటి నుండి ఒక్క ఎన్నికలలో కూడా టిడిపి గెలవలేదని.. దీంతో ఆ పార్టీ నేతలకు పిచ్చెక్కిందన్నారు.

ఎమ్మెల్యేలను కొనాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తామంతా జగన్ బొమ్మతోనే గెలిచామని, వైసీపీని వీడి ఎవరూ రారని చెప్పారు. సొంత నియోజకవర్గం కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు ఓడించినా తండ్రి, కొడుకులకు బుద్ధి రాలేదన్నారు. టిడిపి నేతలు అహంకారం నెత్తికెక్కి అసెంబ్లీలో స్పీకర్ ను అవమానించి, ఆయనపై దాడి చేయడం దారుణమని అన్నారు. స్పీకర్ తో టిడిపి నేతలు దురహంకారంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news