మంత్రి సత్యవతి రాథోడ్ కు మాతృవియోగం.. సంతాపం తెలిపిన కేసీఆర్

-

తెలంగాణ రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాతృమూర్తి గూగులోత్ దస్మా (80) స్వర్గస్తులయ్యారు. హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. మహబూబాద్ జిల్లా కురవి మండలం లోని పెద్ద తండాలో అంతక్రియలు నిర్వహించినట్లు తెలుస్తోంది. గత ఫిబ్రవరి మాసంలో సత్యవతి తండ్రి లింగయ్య నాయక్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

ఆ విషాదం నుంచి మంత్రి కుటుంబ సభ్యులు తేరుకోకముందే తల్లి దాస్మా స్వర్గస్తులయ్యారు. అయితే దస్మా మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు సంతాపం ప్రకటించారు. మంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబానికి సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news