ఓడితే నల్లగొండ ముఖం కూడా చూడడు రాజగోపాల్ రెడ్డి : మంత్రి తలసాని

-

మునుగోడులో ప్రచారం జోరందుకుంది. ప్రత్యర్థులను తికమక పెట్టేందుకు వినూత్న వ్యూహాలు పన్నుతున్నారు నాయకులు. మునుగోడులో ఓటర్లను తమపైపుకు మళ్లించుకునేందుక వరాల జల్లుకు కురిపిస్తున్నారు. అయితే.. తాజా మంత్రి తలసాని శ్రీనివాస్‌ నల్లగొండ జిల్లా నాంపల్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్ మాత్రమే మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ రక్కసిని తరిమికొట్టారన్నారు. రాజగోపాల్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో 3000రూపాయల పెన్షన్ ఇస్తాను అనడం సిగ్గుచేటు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు 3వేలు ఇవ్వడం లేదన్నారు. వెయ్యి కోట్ల రూపాయలు ఎలా తెస్తారో…. దుబ్బాక, హుజురాబాద్ లో తెచ్చారా లేదా చెప్పాలన్నారు.

ఓడితే నల్లగొండ మొఖం కూడా చూడడు రాజగోపాల్ రెడ్డి.. ఎమ్మెల్యే గా నియోజకవర్గంలో ఏనాడు కనిపించని రాజగోపాల్ రెడ్డిని ప్రజలు తిరస్కరిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రచారానికి వచ్చే జాతీయ నేతలు ప్రజలకు ఎం చేశారో చెప్పాలని, తన కొడుకుకు కాంట్రాక్టు వచ్చింది అనడం రాజగోపాల్ రెడ్డి బాధ్యతా రహితంగా ఉంది… తండ్రి కొడుకులు వేరు వేరా చెప్పాలని ఆయన ప్రశ్నించారు. బ్యాంక్ లో ఉన్న గొల్ల కురుమల నగదు వారికి చేరకుండా బీజేపీ అడ్డుకుంది… కానీ ఎన్నికలు అయ్యాక ఆ నగదు గొల్ల, కురుమలకు ఇస్తామని హామీ ఇచ్చారు. నిన్న బాధ్యతా రహితంగా వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై ఎందుకు కాంగ్రెస్ చర్యలు తీసుకోదని, కోమటిరెడ్డి బ్రదర్స్ అహంకారానికి మునుగోడు ప్రజలు కర్ర కాల్చి వాత పెడతారన్నారు మంత్రి తలసాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version