తెలంగాణలో మరో దారుణం.. మాయమాటలు చెప్పి మైనర్‌ బాలికపై అత్యాచారం..

-

రోజూ ఏదో ఓ చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కామాంధులను కట్టడి చేసేందుకు ఎన్ని చట్టాలు తెచ్చినా అవి అలంకార ప్రాయంగా మాత్రమే ఉంటున్నాయని కొందరు విమర్శిస్తున్నారు. ఎందుకంటే.. రోజూ చోటు చేసుకుంటున్న ఈ అఘాయిత్యాలకే దానికి నిదర్శనం.. తాజాగా నారాయణఖేడ్‌లో ఓ యువకుడు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణఖేడ్ మండల పరిధిలోని ఓ 14ఏళ్ళ మైనర్ బాలిక ఈ నెల 6న మిస్సింగ్ అయ్యింది.

దీనితో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  ఫోన్ కాంటాక్ట్ వివరాల ఆధారంగా విచారించగా.. అమ్మాయికి మాయమాటలు చెప్పి నమ్డిమేట్కు చెందిన నవీన్ (18) అనే యువకుడు నాలుగైదుసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించి ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అమ్మాయిని
కుటుంబీకులకు అప్పగించి, నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ శ్రీరామ్, సీఐ రామకృష్ణ
రెడ్డి, ఎస్సె వెంకట్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version