మరో దారుణం : మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

-

చట్టలపైన, పోలీసులంటే భయ లేకుండా పోతోంది కామాంధులకు.. తమ కామ వాంఛ తీర్చుకోవడానికి మృగాళ్లు ఎంతకైనా తెగిస్తున్నారు. అన్యం పుణ్యం తెలియని మైనర్ బాలికపై విచక్షణ రహితంగా అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే ఇది.. వివరాల్లోకి వెళితే.. ఐదుగురు వ్య‌క్తులు బాలిక‌(15)ను కిడ్నాప్ చేసి కారులో సామూహిక అత్యాచారాని పాల్ప‌డిన ఉదంతం జార్ఖండ్ రాజ‌ధాని రాంచీలో వెలుగుచూసింది. నిందితులు ధుర్వ రింగ్ రోడ్డు వ‌ద్ద త‌న‌ను బ‌ల‌వంతంగా కారులో ఎక్కించుకున్నార‌ని బాకి లిక పోలీసులకు వెల్ల‌డించింది.

Premium Photo | Sexual abuse with a man thief or robber swiping zip of pants  after rape woman in abandoned house

ర‌తు పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ద‌ల‌దాలి ప్రాంతంలోని రెస్టారెంట్ వ‌ద్ద పార్కు చేసిన కారును పెట్రోలింగ్ పోలీసులు అనుమానంతో త‌నిఖీ చేయ‌గా ఈ దారుణం బ‌య‌ట‌ప‌డిందని పోలీసులు వెల్లడించారు. కారులో ఐదుగురు వ్య‌క్తులు ఉండ‌గా బాలిక ఏడుస్తుండ‌టంతో పోలీసులు బాలిక‌ను కాపాడి నిందితుల‌ను అరెస్ట్ చేశారని రాంచీ రూర‌ల్ ఎస్‌పీ నౌష‌ద్ ఆలం వెల్లడించారు. వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం బాలిక‌ను కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించిన పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news