లోకేష్ పప్పు అని మరోసారి నిరూపించుకున్నాడు: మాజీ మంత్రి అనిల్ కుమార్

-

ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇప్పటికే మంత్రి అంబటి రాంబాబుకు, టీడీపీ నేతలకు మధ్య ట్వీట్ల యుద్ధం సాగుతోంది. తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా విమర్శలకు పనిచెప్పారు. లోకేష్ మరోసారి పప్పు అని నిరూపించుకున్నాడని ఆయన అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. కిన్నెర ప్రసాద్ కు నేను బినామీ అని లోకేష్ అంటున్నారని…అక్రమ లే ఔట్లులోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయవద్దని ప్రభుత్వం స్పష్ఠమైన ఆదేశాలు ఇచ్చిందని… ఇది కూడా తెలియదా..? నన్ను కిన్నెర ప్రసాద్ కు బినామీ అని పప్పు ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. టీడీపీలో ఉన్నపుడే కిన్నెర ప్రసాద్ నాలుగు లే అవుట్లు వేశారని…అవి కూడా అక్రమ లే ఔట్ లేనా..? అంటూ ప్రశ్నించారు. బినామీలు నారాయణా…? నువ్వా..? అంటూ లోకేష్ ను ప్రశ్నించారు. అప్పుడు వేసిన లే ఔట్ లు అన్నీ సక్రమమైన వని చెప్పే ధైర్యం ఉందా..? టీడీపీకి చెందిన కొందరు సీనియర్ నేతలు వైసీపీ ఎమ్మెల్యేలతో లోపాయికారి ఒప్పందంతో ఉన్నారని… నేను రుజువు చేస్తా అని సవాల్ చేశారు. మొదటగా దాన్ని చూసుకో అని లోకేష్ కు హితవు పలికారు.

 

Read more RELATED
Recommended to you

Latest news