సీఎం జగన్ తో ప్రజలు విసిగిపోయారు… : MLA గంటా శ్రీనివాసరావు

-

టీడీపీ సీనియర్ నాయకుడు మరియు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చాలా అరుదుగా మీడియా ముందుకు వస్తూ ఉంటారు. తాజాగా గంటా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సాగిస్తున్న పాలన గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని బాధపడ్డారు. ఇందుకు సాక్ష్యంగా విశాఖ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నప్ అని చెప్పారు. ఇంకా గంటా మాట్లాడుతూ మొదటిసారి సీఎం అయిన జగన్ చేస్తున్న పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని ఆవేదన చెందారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సీఎం ను గద్దె దించడానికి ఆంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమాగా అన్నారు. రాష్ట్ర పాలనను అభివృద్ధితో పరుగులు పెట్టించగల విజనరీ లీడర్ చంద్రబాబు ను ప్రజలు సీఎం కావాలని అనుకుంటున్నారని గంటా తెలిపారు.

ఇక ఇటీవల టీడీపీ స్టార్ట్ చేసిన బస్సు యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వస్తోందని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news