కేసీఆర్‌పై నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

-

నర్సాపూర్ లో ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ నెల 21న ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో నర్సాపూర్ టికెట్ పెండింగ్ లో పార్టీ అధిష్టానం పెట్టింది. గత వారం నుంచి ఎమ్మెల్యే వరుసగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ.. నాకు రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ అని ఆయన తెలిపారు. అయితే, పరోక్షంగా సునీతా లక్ష్మరెడ్డిపై మదన్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడు.

MLA Madan Reddy : కేసీఆర్ బావిలో దూకమంటే దూకుతా.. నాకు అన్యాయం చేయడు - NTV  Telugu

సునితా లక్ష్మారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. టిక్కెట్ విషయంలో తనకు, సునితకు మధ్య టగ్ ఆఫ్ వార్ ఏమీ లేదని, తనకు టిక్కెట్ ఇస్తే వార్ వన్ సైడ్ ఉంటుందన్నారు. టిక్కెట్ రాకుంటే పార్టీ మారుతారా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. అసలు ఆ సమస్యే ఉత్పన్నం కాదన్నారు. తాను ఎటూ వెళ్లేదు లేదు… అలాగే కేసీఆర్ తనకే టిక్కెట్ ఇస్తారనే నమ్మకం ఉందన్నారు. తనకు కేసీఆర్ న్యాయం చేస్తాడని చెప్పారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిందే కేసీఆర్ అని, పార్టీ మారేది లేదన్నారు. తనను నియోజకవర్గ ప్రజలు రెండుసార్లు గెలిపించారన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news