ఎమ్మెల్యేలు రూ.25వేలు ఇవ్వాలి.. సీఎల్పీలో సంచలన నిర్ణయం

-

హైదరాబాద్ లోని నోవాటెల్ వేదిక గా జరుగుతోన్న సీఎల్పీ మీటింగ్ లో సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అభివృద్ధికి ప్రతీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎమ్మెల్యేలంతా జనాల్లో ఉండాలని.. విస్తృతంగా గ్రామాల్లో పర్యటించాలని సూచించారు. అంతేకాదు.. పార్టీ లైన్ దాటి ఎవ్వరూ మాట్లాడకూడదని.. పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తా అంటే కుదరదని పేర్కొన్నారు. భయపడే పరిస్థితిలో పార్టీ లేదని చెప్పారు. 

అద్దంకి దయాకర్ లాగా అందరూ ఓపికతో ఉండాలని.. దయాకర్ ఓపికగా ఉన్నాడు కాబట్టే ఎమ్మెల్సీ అయ్యాడని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి వర్గ విస్తరణ అంశం హైకమాండ్ చూసుకుంటుందని.. దీని గురించి ఎవ్వరూ బహిరంగంగా బయట మాట్లాడొద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సీఎల్పీ సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చ చేశారు. భూ భారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలతో పాటు ఇతర సంక్సేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయం పై నేతలు చర్చించారు. 

Read more RELATED
Recommended to you

Latest news