బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

-

హైదరాబాద్ నగరంలో ప్రఖ్యాతిగాంచిన బాలాపూర్ గణేశుడిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్సీ కవితకు లడ్డు ప్రసాదం అందజేశారు. ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఇతర నాయకులు పూజలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. బాలాపూర్ గణేశుడిని తొలిసారిగా దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.

వినాయక ఉత్సవాలలో బాలాపూర్ లడ్డుపై ఉత్సాహం ఉంటుందని చెప్పారు. ఆ గణేశుడి దయవల్ల ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. గణేశుడి దయవల్ల భారతదేశంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉండాలని మనస్పూర్తిగా మొక్కుకున్నట్లు తెలిపారు. కమిటీగా ఏర్పడి గ్రామస్తులు ఎంతో వైభవంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారని తెలిపారు. ఈసారి కూడా లడ్డు రికార్డు ధర పలుకుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news