కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది: MLC కవిత

-

తెలంగాణ లో అధికారం లోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దుర్వినియోగం చేస్తోందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెప్పారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి లో మీడియాతో ఆమె మాట్లాడారు. అధికారం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ నాయకులు మీద అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందని చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి టిఆర్ఎస్ కార్యకర్తల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని అన్నారు.

రాజకీయంగా ఎదుర్కోలేక కేసులు పెడుతున్నారని అన్నారు బిఆర్ఎస్ నేతల మీద అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని అన్నారు. అలానే ఆమె మాట్లాడుతూ.. పోరాడుతాం కార్యకర్తల్ని కాపాడుకుంటామని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. రాష్ట్రంలో మహిళలుకు, విద్యార్థులుకు రైతులకి రక్షణ లేదని అన్నారు నిన్న ఏబీవీపీ విద్యార్థిని ఝాన్సీ ని మహిళా కానిస్టేబుల్ జుట్టు పట్టి లాగడం మీద కూడా కవిత ట్విట్టర్ ద్వారా సీరియస్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version