తెలంగాణ పర్యటన: బండి సంజయ్ కు మోదీ స్పెషల్ విషెస్ !

-

ఈ రోజు మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా కాసేపటి క్రితమే బేగంపేట విమానాశ్రయం కు విచ్చేసిన సంగతి తెలిసిందే. కాగా సికింద్రాబాద్ మరియు తిరుపతి మధ్యన ప్రయాణించే వందే భారత్ ట్రైన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఇప్పటికీ ఈ మార్గమధ్యంలో ట్రైన్ లు ఉన్నప్పటికీ.. ఈ కొత్త ట్రైన్ ను నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ తర్వాత కొన్ని శంకుస్థాపనల పనులను ముగించుకుని వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయంలో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోదీని రిసీవ్ చేసుకోవడానికి వహ్సిన తెలంగాణ మంత్రి తలసాని, గవర్నర్ తమిళిసై , బీజేపీ ఎంపీలు వచ్చారు.

ఇందులో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా విచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే అందరికీ నమస్కారం పెట్టుకుంటూ వచ్చిన మోఢీ.. బండి సంజయ్ దగ్గరకు వచ్చేసరికి చేతులు పట్టుకుని నవ్వుతూ విషెస్ చెప్పడం ఇప్పుడు వైరల్ గా మారింది. బహుశా నిన్ననే కేసు నుండి బెయిల్ పై విడుదల అయ్యాడు . కదా దానిని ఆలోచిస్తూ ఇలా చేసుంటాడని అందరూ అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news