దుబ్బాక విజయం.. తెలుగులో ట్వీట్ లు చేసిన మోడీ-షా

-

దుబ్బాకలో బీజేపీ గెలిచిన నేపధ్యంలో మోడీ, అమిత్ షాలు తెలుగులో ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. దుబ్బాక ఒక చారిత్రక విజయమని అన్నారు ప్రధాని మోడీ. తమకు ఆశీస్సులు అందింటిన దుబ్బాకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారాయన. తెలంగాణ అభివృద్ధికి సేవ చేసేందుకు ఈ విజయం మ రింత శక్తినిస్తుందని అన్నారు ప్రధాని. కార్యకర్తలు ఎంతో కృషిచేశారని చెప్పారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కేంద్రమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో విజయ‌ం సాధించడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు.

నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ నాయకులంతా సమష్టిగా పోరాడి దుబ్బాకలో విజయం సాధించినందుకు షా అభినందనలు తెలియజేశారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలలో విజయం సాధించడానికి కృషి చేసిన బీజేపీ కార్యకర్తలకు,రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ గారికి శుభాభినందనలు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉంది. రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కాపాడుకోవటంలో,మోదీ ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేస్తోంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. దుబ్బాక ఎన్నికల వేళ బండి సంజయ్‌పై దాడి సమయంలోనూ షా ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news