మహమ్మద్ సిరాజ్ కు బంపర్‌ ఆఫర్‌..ఇంగ్లాండ్ జట్టులో ప్లేయర్‌ గా !

-

టీమిండియా పెసర్ మహమ్మద్ సిరాజ్ కు బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. టీమిండియా పెసర్ మహమ్మద్ సిరాజ్ తొలిసారి ఇంగ్లాండ్ కౌంటిల్లో ఆడనున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ 2022 సీజన్ లోని చివరి మూడు మ్యాచ్ లకు వార్విక్ షైర్ కౌంటి క్రికెట్ క్లబ్ సిరాజ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని వార్విక్ షైర్ కౌంటింగ్ క్రికెట్ క్లబ్ మీడియా సమావేశంలో గురువారం వెల్లడించింది.

“కౌంటీ ఛాంపియన్షిప్ సీజన్ లోని ఆఖరి మూడు మ్యాచ్ లకు భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తో ఒప్పందం చేసుకున్నాము. ఎడ్జ్ భాస్టన్ వేదికగా సెప్టెంబర్ 12న సోమర్ సెట్ తో మ్యాచ్ కు సిరాజ్ జట్టుతో కలవనున్నాడు” అని వార్విక్ షైర్ కౌంటి క్రికెట్ క్లబ్ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇక ఇదే విషయం పై సిరాజ్ మాట్లాడుతూ, కౌంటి క్రికెట్లో ఆడేందుకు అనుమతి ఇచ్చిన బీసీసీఐకు కృతజ్ఞతలు తెలపాలి అనుకుంటున్నాను. వార్విక్ షైర్ వంటి ప్రతిష్టాత్మక క్లబ్ లో ఆడేందుకు అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంగ్లాండులో ఆడడాన్ని నేను ఎప్పుడూ ఆస్వాదిస్తానని సిరాజ్ అన్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news