”మా” అధ్యక్ష ఎన్నికలపై మోహన్‌ బాబు సంచలన వ్యాఖ్యలు

-

”మా” అధ్యక్ష ఎన్నికలపై టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మోహన్‌ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ”మా” కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మోహన్‌ బాబు మాట్లాడుతూ… ఏం మాట్లాడాలి.. ఎలా మాట్లాడాలి అనేది తెలియని పరిస్థితులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్నారని మండి పడ్డారు.

జీవిత… మా లోకి రాజశేఖర్‌ కు వెలకం అని చెప్పండి… కూడ బెట్టిన డబ్బుతో బిల్డింగ్‌ కొని.. మళ్లీ అమ్మేయడం ఎంత వరకు సమంజసం అని అభిప్రాయ పడ్డారు మోహన్‌ బాబు. బిల్డింగ్‌ కొనడం ఏంటి.. దాన్ని సగం ధరకు అమ్మడం ఏంటి… పెద్దలు ఆలోచించాలని తెలిపారు. త్వరలో ఎన్నికలు పెడతారని భావిస్తున్నానని చెప్పిన మోహన్‌ బాబు… దీనిపై అభిప్రాయాలు తీసుకుని కృష్ణం రాజు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కాగా.. ”మా” అధ్యక్ష ఎన్నికల నేపథ్యం లో టాలీవుడ్‌ నటుల మధ్య గొడవ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version