సొంత పార్టీ నేతలపై ఎంపి కేసినేని నాని విమర్శలు !

-

టిడిపి ఎంపీ కేసీనేని నాని సొంత పార్టీ నేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అంతర్గత చర్చలు, సమీక్షా సమావేశాలలో సంభాషణలను వక్రీకరించి ప్రచారం చేసే వారిని ఉపేక్షించేది లేదని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టిడిపి విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు నెట్టెం రఘురాం పార్టీ శ్రేణులను హెచ్చరించారు. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్న నెట్టెం రఘురాం వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు కేసినేని నాని.

” ఛ నిజంగా.. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారి లిస్ట్ పంపుతాం నిజంగా చర్యలు తీసుకుంటారా”. అంటూ ఎద్దేవా చేశారు. కొంతకాలంగా కేశినేని నాని పదేపదే సంత పార్టీ నేతలపైనే విమర్శలు చేస్తున్నారు. గతంలో కూడా సొంత పార్టీ నేతలు, అధిష్టానం పై విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు. ఆ తర్వాత అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. నానితో రెండు మూడు సార్లు సమావేశమై చర్చించి బుజ్జగించారు. తాజాగా మరోసారి కేసీనేని నాని వాక్యాలు పార్టీలో కలకలం రేపుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version