కూతురితో కలిసి రోహిత్​ శర్మ​ డ్యాన్స్..!

-

యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు మొత్తం 53 రోజుల్లో 60 ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్న సంగతి తెలిసిందే. దుబాయ్‌, అబుదాబి, షార్జా వేదికల్లో మొత్తం 53 రోజుల విండోలో 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. లీగ్ కోసం ఇప్పటికే యూఏఈ చేరుకున్న అన్ని ప్రాంఛైజీలు క్వారంటైన్ పూర్తిచేసుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి. అలాగే లీగ్‌లో మొదటి మ్యాచ్ సెప్టెంబర్‌ 19న రన్నరప్ చెన్నై సూపర్‌ కింగ్స్‌, డిపెడింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు జట్టుల ఆటగాళ్లు ప్రాక్టీస్ మీద బాగా దృష్టి పెట్టారు.

ముంబై ఇండియన్స్​ కెప్టెన్ రోహిత్​ శర్మ కూడా బ్యాటింగ్‌, ఫీల్డింగ్ ప్రాక్టీస్ తో చాలా కష్టపడుతున్నాడు. అయితే గ్రౌండ్ లో చెమటలు చిందించిన అనంతరం.. భార్య రితిక, కుమార్తె సమైరాలతో కలిసి యూఏఈలో సరదాగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే శనివారం తన కూతురు సమైరాతో కలిసి హ్యాపీగా గడిపిన క్షణాలను రోహిత్​ ఇన్​స్టాగ్రామ్​ వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. ఇందులో సమైరా చేతులు పట్టుకుని.. చిన్నపిల్లాడిలా గెంతులేస్తూ అలరించాడు.

Read more RELATED
Recommended to you

Latest news