జేపీ నడ్డా మాటలన్నీ జూటా మాటలే : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

-

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా చేసిన వ్యాఖ్య‌ల‌న్నీ కూడా జూటా మాట‌లే అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి అన్నారు. బీజేపీ అంటే భార‌తీయ జూటా పార్టీ అని మరో సారి రుజువు అయింద‌ని విమ‌ర్శించారు. లోకల్ నాయ‌కులు రాసింది చూసి జేపీ నడ్డా మాట్లాడార‌ని అన్నారు. అలాగే మెంటల్ బ్యాలెన్స్ త‌ప్పింది కేసీఆర్ కు కాద‌ని.. బండి సంజయ్ కు మెంటల్ బ్యాల‌న్స్ త‌ప్పింద‌ని విమర్శించారు. మిష‌న్ భ‌గిర‌థా, కాళేశ్వ‌రంపై జేపీ న‌డ్డా మాట్లాడిన‌వి అన్నీ కూడా పచ్చి అబద్ధాల‌ని అన్నారు. త‌నతో జేపీ న‌డ్డా ర‌వాల‌ని మిష‌న్ భ‌గిరథా నీళ్లు ప్ర‌తి ఇంట్లో చూపిస్తాన‌ని స‌వాల్ విసిరారు.

jeevan reddy

అలాగే కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై మాట్లాడే అర్హ‌త బీజేపీ నాయకుల‌కు లేద‌ని అన్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ కు బీజేపీ ప్ర‌భుత్వం జాతీయ హోదా ఇవ్వాలేద‌ని గుర్తు చేశారు. అలాగే జేపీ న‌డ్డా హైద‌రాబాద్ కు వ‌చ్చింది.. బండి సంజ‌య్ కోసం కాద‌ని ఆర్ఎస్ఎస్ స‌మావేశాల కోసం వ‌చ్చార‌ని అన్నారు. ఈ స‌మావేశం కోసం ఆయ‌న షెడ్యూల్ ఆరు నెల‌ల క్రితమే ఫైన‌ల్ అయింద‌ని అన్నారు. కానీ జేపీ న‌డ్డా త‌ను బండి సంజ‌య్ కోసం వ‌చ్చాన‌ని ప‌చ్చి అబద్ధాలు చెబుతున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news