ప్రభుత్వ ఆంక్షలతో పాదయాత్రలు ఆగవు – నాగబాబు

-

వైసిపి ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జనసేన నేత కొనిదెల నాగబాబు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ నుంచి తాడిపత్రి వెళ్ళే చెరువుకట్ట పైన ఉన్న రోడ్డును ఆదివారం పరిశీలించారు జనసేన నేత నాగబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా పర్యటనతో రోడ్డు బాగుపడుతుంది అంటే అదే సంతోషం అన్నారు. రాష్ట్రంలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయో ప్రభుత్వ పాలన అలానే ఉందని ఆరోపించారు. జీవో నెంబర్ 1 విషయంలో ప్రభుత్వానికి కోర్టులు మెట్టికాయలు వేశాయని అన్నారు.

ప్రభుత్వ ఆంక్షలతో పాదయాత్రలు ఆగవన్నారు నాగబాబు. పొత్తుల విషయాలని పార్టీ అధ్యక్షుడు చూసుకుంటారని తెలిపారు. గతంలో విశాఖలో పవన్ ని ఇబ్బంది పెట్టారని.. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చూద్దాం అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news