టీఆర్‌ఎస్‌ కు బిగ్‌ షాక్‌..కాంగ్రెస్ గూటికి నల్లాల ఓదెలు !

-

టీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. త్వరలోనే కాంగ్రెస్ గూటికి చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది. కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సన్నాహాలు చేసినట్లు సమాచారం అందుతోంది.

ఇందులో భాగంగానే.. నల్లాల ఓదెలు, ఆయన భార్య మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో పాటు కుటుంబసభ్యులు, మరో ప్రజాప్రతినిధి దేశ రాజధాని ఢిల్లీ లోనే ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇవాళ రాహుల్‌ గాంధీతో కలిసిన అనంతరం.. రేపు కాంగ్రెస్‌ పార్టీ చేరతారని సమాచారం అందుతోంది.

దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా…మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో చెన్నూర్‌ ఎమ్మెల్యేగా.. టీఆర్ఎస్‌ పార్టీ తరఫున నల్లాల ఓదెలు గెలిచారు. అయితే… 2018 ముందస్తు ఎన్నికల్లో మాత్రం.. నల్లాల ఓదెలుకు కాకుండా.. బాల్క సుమన్‌ కు టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చింది. దీంతో అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు నల్లాల ఓదెలు.

Read more RELATED
Recommended to you

Latest news