UNSTAPABLE SHOWపై వైసీపీ ఎమ్యెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..NTR మరణానికి బాలయ్య, చంద్రబాబు కారకులే !

-

బాలయ్య టాక్ షోలో చంద్రబాబు చెప్పినవిన్నీ పచ్చి అబద్ధాలేనని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఎన్టీ రామారావుని ముఖ్యమంత్రి పదవి నుంచి దించి మానసికంగా చంద్రబాబు హత్య చేశారు.. ఇలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూకు బాలకృష్ణ ఆహ్వానించారని ఫైర్ అయ్యారు. ఇంటర్వ్యూ పూర్తిగా రాలేదు ..14వ తేదీ వస్తుందని అంటున్నారు.. రాత్రి కొంచెం చూశాను… ఈయన ఎన్టీ రామారావు కాళ్లు పట్టుకున్నాడు అంట అంటూ మండిపడ్డారు.

14 మంది శాసనసభ్యులు ఎన్టీ రామారావుతో ఉన్నాము.. వైస్రాయ్ హోటల్ వ్యవహారం నుంచి ఎన్టీ రామారావు చనిపోదాకా 14 మంది ఎమ్మెల్యేలు ఆయన తోనే ఉన్నామని తెలిపారు. మిగతా వారందరూ చంద్రబాబుకి రామోజీరావు కి అమ్ముడు పోయారని ఆరోపణలు చేశారు. చంద్రబాబు నైజం కాళ్లు పట్టుకొని లాగేయటమేనని.. ముఖ్యమంత్రిగా ఎన్.టి.రామారావు ఉంటే కాళ్లు పట్టుకొని లాగేసాడు…లక్ష్మీపార్వతిని పక్కన పెట్టండి మీరు ముఖ్యమంత్రి అవుతారానడం అబద్దమన్నారు.

ఎన్టీరామారావు అంటే మహానుభావుడు ఒక భగవంతుడు.. ఎన్టీరామారావులో భగవంతుని చూసుకున్నామన్నారు. పసిపిల్లల మనస్తత్వం కలిగిన వ్యక్తి…చంద్రబాబుది నీచమైన మనస్తత్వమని పేర్కొన్నారు. నార నారానా. విషమే.. నమ్మి ఆడబిడ్డనిస్తే మామ గొంతు కోశాడని..నిప్పులు చెరిగారు. ఆరోజు వైస్రాయ్ హోటల్లో ఎన్టీరామాను దించే దాంట్లో బాలకృష్ణ కూడా ఒక వ్యక్తి అని.. అల్లుళ్లు ..కొడుకులు ఒకటై ఎన్టి రామారావుకి ద్రోహం చేశారన్నారు. ఈరోజు ఎన్టీ రామారావు భజన చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news