బుగ్గన చెప్పింది బుర్ర కథట‌.. నారా లోకేష్ ట్విట్‌..!

-

టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి, చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ ఎప్ప‌టిక‌ప్ప‌డు ట్విట‌ర్ వేదికాగా అధిక‌రప‌క్షంపై విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా కూడా ఇదే జ‌రిగింది. టీడీపీ తీసుకొచ్చిన కంపెనీలన్నింటినీ వారి ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రం వ్య‌క్తం చేశారు. కియా మోటార్స్ విషయంలో లెటర్ చదువుతూ, అధ్యక్షా అంటూ మంత్రి బుగ్గన బుర్ర కథ వినిపించారని విమర్శించారు. అలాగే, చంద్రబాబుగారి హయాంలో కష్టపడి తెచ్చిన టీసీఎల్ ని కూడా వారి ఖాతాలో వేసుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు టోరే వంతు వచ్చిందని.. చంద్రబాబు ఈ కంపెనీ కోసం ఎంతో కష్టపడి, వారితో ఫాలో అప్ చేసి, తీసుకువచ్చారని నారా లోకేశ్ అన్నారు.

టీడీపీ హయాంలో భూమి పూజ అయిపోయిన కంపెనీని, అప్పుడే బిల్డింగులు రెడీ అయిపోయిన కంపెనీని, ఇప్పుడు తామే తెచ్చినట్టు హడావుడి చేస్తున్నారని విమ‌ర్శ‌లు గుప్పించారు. జరగాలి పెళ్లి మళ్ళీమళ్ళీ.. అనే కాన్సెప్ట్ ముఖ్యమంత్రి జగన్ గారిని చూసే పెట్టారేమో అని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఎంతో కష్టపడి ఈ కంపెనీ తీసుకువచ్చామని, కియా మోటార్స్ ని బెదిరించినట్టు ఈ కంపెనీని కూడా బెదరగొట్టి తరిమేయకండని హితవు పలికారు అంటూ లోకేష్ ట్విట‌ర్‌లో ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news