జగన్ రెడ్డి విద్యార్థులకు మేనమామ కాదు.. నరహంతక రాక్షస మామ – నారా లోకేష్

-

కర్నూలు జిల్లా కౌతాళం మండలం హల్వి గ్రామంలో ప్రాథమిక పాఠశాల గోడ కూలి పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. పాఠశాలలో నాడు – నేడు పథకం కింద పనులు జరుగుతున్న సమయంలో జెసిబి తో పాత పాఠశాల గదులను తొలగిస్తున్నారు. ఈ సమయంలో గది గోడతో పాటు పైకప్పు కూడా కూలింది. కూలిన పెల్లలు పక్క గదిలో చదువుకుంటున్న విద్యార్థులపై పడ్డాయి.

ys jagan on nara lokesh

దీంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థులను వెంటనే బయటికి తీసుకువెళ్లారు. ఈ ఘటనలో 8 మంది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయురాలు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. “కోట్లు కొట్టేసేందుకు పసిపిల్లల ప్రాణాలూ పణంగా పెట్టేస్తున్న జగన్ రెడ్డి విద్యార్థులకు మేనమామ కాదు..నరహంతక రాక్షస మామ.

కర్నూలు జిల్లా కౌతాళం మండలం హాల్వి స్కూల్ నాడు – నేడు పనుల్లో వైసీపీ సర్కారు నిర్లక్ష్యంతో గోడకూలి ఎనిమిది మంది పిల్లలు, టీచర్ సుజాతకి తీవ్రగాయాలయ్యాయి. పాత స్కూల్ భవనం కూల్చుతున్నప్పుడు ఆనుకుని ఉన్న కొత్త భవనంలో పిల్లలని ఖాళీ చేయించాలని కనీస బాధ్యతలేని వైసీపీ కాంట్రాక్టర్, అధికారులే ఈ ప్రమాదానికి బాధ్యులు. వైసీపీ సర్కారుకు నాడు-నేడు పనుల్లో దోపిడీపై ఉన్న శ్రద్ధ పిల్లల ప్రాణాలపై లేకపోవడం విచారకరం” అని మండిపడ్డారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news