వైసీపీ నుంచి రక్షించేందుకు ప్రత్యేక చట్టం తేవాలి – నారా లోకేష్‌

-

వైసీపీ నుంచి రక్షించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని సరికొత్త డిమాండ్‌ ను తెరపైకి తీసుకొచ్చారు టీడీపీ పార్టీ అగ్ర నేత నారా లోకేష్‌. దళితులపై వైసీపీ దమన కాండకి అంతు లేకుండా పోయింది. అధికారం అండగా అరాచకాలకి తెగబడుతున్నారని వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్‌.

నెల్లూరు జిల్లా, కావలి మండలం, ముసునూరు గ్రామంలో వైసీపీ నేతలు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డి వేధింపులకు దళిత యువకుడు దుగ్గిరాల కరుణాకర్ బలి కావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వైసీపీ నేతలు చేసిన హత్య. ఎస్సీ యువకుడి మరణానికి కారకులైన వైసీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ నేతల నుంచి దళితుల్ని రక్షించేందుకు ప్రత్యేక చట్టం తేవాల్సిన భయానక పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని వెల్లడించారు టీడీపీ పార్టీ అగ్ర నేత నారా లోకేష్‌. ఏపీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news