హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. నేడు 34 MMTS రైళ్లు రద్దు

-

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు మరోసారి షాక్‌ ఇచ్చింది. రాజధానిలో నేడు టెట్‌, ఆర్‌ఆర్బీ పరీక్షలు ఉన్నప్పటికీ వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్‌ (MMTS) సర్వీసులను రద్దు చేసింది. సాంకేతిక కారణాల వల్ల 34 ఎంఎంటీఎస్‌ సర్వీసులను నిలిపివేస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆగస్టు 21వ తేదీన అంటే నేడు 34 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు కానున్నాయి. లింగంపల్లి-హైదరాబాద్ రూట్‌లో 9 సర్వీసులు రద్దు కాగా.. హైదరాబాద్-లింగంపల్లి రూట్‌లోనూ 9 సర్వీసులు రద్దైనట్లు తెలిపింది. ఫలక్‌నుమా-లింగంపల్లి రూట్‌లో 7 సర్వీసులు రద్దు అయ్యాయి.

Hyderabad: MMTS ready to resume, awaiting green signal

లింగంపల్లి-ఫలక్​నుమా రూట్‌లో 7 సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించింది. లింగంపల్లి – సికింద్రాబాద్, సికింద్రాబాద్-లింగంపల్లి రూట్‌లో ఒక్కో సర్వీసు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది. కాగా, సెలవు రోజు వస్తే చాలు ఏదో ఒక కారణం చెప్పి ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తున్నారని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news