వైసీపీ నేతలు అసెంబ్లీ రౌడీలు, సినిమాల్లో విలన్లు – లోకేష్

-

సినిమాల్లో విలన్ల మాదిరి వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని టిడిపి నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. అధికార పార్టీ నాయకులు ఉన్మాదం కట్టలు తెంచుకుంటోంది. ప్రతిపక్షాలు, ప్రజలు అయిపోయారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల‌పై పడ్డారు వైసిపి అసెంబ్లీ రౌడీలు అని మండిపడ్డారు.

త‌న అనుచ‌రుల బిల్లులు చేయ‌లేద‌ని పోలవరం ఏఈ సూర్యకిరణ్ ని వైసిపి రౌడీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కొట్ట‌డం దారుణమన్నారు. మంత్రి, ఉన్నతాధికారుల సమక్షంలోనే ఇంజ‌నీరుపై దాడి జరిగినా ఎవరూ ఆపే ప్రయత్నం కూడా చెయ్యకపోవడం విచారకరం. ఉద్యోగుల హక్కులు, ప్ర‌యోజ‌నాల‌ కోసం పోరాడే ఉద్యోగ సంఘాల నాయకులు ఈ దాడిని ఖండించ‌క‌పోవ‌డం అన్యాయ‌మే. ఏఈ సూర్య కిరణ్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. దాడి చేసిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజాని తక్షణమే అరెస్ట్ చెయ్యాలి. బాధితుడు ఏఈ సూర్య కిరణ్ కి న్యాయం చెయ్యాలి.అని డిమాండ్ చేశారు టిడిపి నేత నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news