ఏఐసీసీ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన రోజే.. ఖర్గే పోస్టర్ల చించివేత

-

ఏఐసీసీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్‌ ఖర్గే పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే కర్ణాటకలోని కోలార్‌లో ఆయన పోస్టర్‌ను దుండగులు చించివేశారు. ఈ ఘటనకు నిరసనగా పార్టీ కార్యకర్తలు వక్కలేరి రోడ్డును బ్లాక్‌ చేశారు. ఖర్గే పోస్టర్‌ చించివేతతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని పరిస్ధతి అదుపులోకి తీసుకువచ్చారు.

పార్టీ అధ్యక్ష పగ్గాలను చేపట్టేముందు ఖర్గే రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. పార్టీ ఎదుగుదలకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని, సవాళ్లను కార్యకర్తలు, నేతలతో కలిసి దీటుగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. ఖర్గే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news