ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపిన బిఎస్పి

-

బిజెపి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బీఎస్పీ మద్దతు ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఎంపీలు ద్రౌపది మార్ముకి ఓట్లు వేస్తారని బీఎస్పీ చీఫ్ మాయావతి తెలిపారు. ఈ నిర్ణయం బిజెపి, ఎన్డీఏకు మద్దతు గా లేదా ప్రతిపక్షానికి వ్యతిరేకంగా తీసుకోలేదని మాయావతి స్పష్టం చేశారు. మా పార్టీని, మా సిద్ధాంతాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము కి మద్దతు ఇవ్వాలని తాము నిర్ణయించామని తెలిపారు.

తాము బిజెపికి గాని ఎన్డీఏకి గాని మద్దతు ఇవ్వడం లేదని తెలిపారు. అలాగని ప్రతిపక్షాలకు వ్యతిరేకం కాదు.. పార్టీ విధానాలను దృష్టిలో ఉంచుకుని ఈమేరకు నిర్ణయం తీసుకున్నామని మాయావతి చెప్పారు. మద్దతు అంశంపై ప్రతిపక్షాలు తమను సంప్రదించలేదని వెల్లడించారు. కాగా రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ముని ఎంపిక చేయడంపై దేశంలోని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయని ప్రధాని మోడీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news