కాంగ్రెస్ జోడో యాత్రలో విషాదం.. ఎంపీ గుండెపోటు మృతి

-

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ చౌదరి గుండెపోటుతో మరణించారు. పంజాబ్ ఫిలోర్ వద్ద యాత్రకు చేస్తుండగా… ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు.

దీంతో ఆయనను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గమధ్యమంలోనే ఆయన మృతి చెందడం గమనార్హం. కాగా సంతొక్ సింగ్ చౌదరి ప్రస్తుతం జలంధర్ ఎంపీగా పనిచేస్తున్నారు. గతంలో పంజాబ్ పంజాబ్ మంత్రిగా కూడా ఆయన పని చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news