కాంగ్రెస్ నాకు తల్లిలాంటిది..నాకేం కావాలో సోనియమ్మకు తెలుసు – డీకే

-

కర్ణాటక సీఎం పదవీ పై డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాకు తల్లిలాంటిది..నాకేం కావాలో సోనియమ్మకు తెలుసు అన్నారు డీకే.సోనియాగాంధీ నన్ను పిలిచారు.. పార్టీకి, నాకు చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులున్నాయి.. నిన్నటి కంటే ఈరోజు నా ఆరోగ్యం బాగానే ఉంది.. ఢిల్లీ వెళ్లాక సోనియా గాంధీతో చర్చిస్తానని వెల్లడించారు డీకే శివకుమార్‌. పిల్లలకు ఏం ఇవ్వాలో దేవుడికి, తల్లికి తెలుసు…నేను నా దేవుడిని కలవడానికి గుడికి వెళ్తున్నానని పేర్కొన్నారు.

కాగా, కర్నాటక సిఎం పంచాయతీపై ఢిల్లీలో చర్చ జరుగుతుంటే…బెంగుళూరులో అధికారులు కొత్త ప్రభుత్వం కోసం అసెంబ్లీ, సచివాలయాన్ని సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఐదు గ్యారెంట్ స్కీమ్ పధకాలు అమలుకు కావాల్సిన ఫైల్స్ ను రెడి చేస్తున్నారు అధికారులు… కొత్త ముఖ్యమంత్రి రాజ్ భవన్ లో ప్రయాణస్వీకారం ఉంటుందా లేరా బహిరంగ సభ ద్వారా చేస్తారనే చర్చ జరుగుతోంది. ఐదు గ్యారంటీ స్కీమ్ హామీలపై తొలి సంతకం చేయనుంది కాంగ్రెస్‌ పార్టీ సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Latest news