రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై రైల్వే టికెట్లకు EMI లు

-

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. డబ్బులు లేకపోయినా వస్తువుల కొనుగోళ్లకు కొన్ని బ్యాంకులు అవకాశం ఇచ్చాయి. ఆ నగదు కూడా నెలసరి వాయిదాల రూపంలో చెల్లించుకోవచ్చు. ఈ సదుపాయంతో పలువురు ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు, దుస్తులు, గృహోపకరణాలు కొనుగోలు చేస్తున్నారు. కొందరైతే బంగారం, తదితరాలను కూడా కొనుగోలు చేసుకుంటూ ఉన్నారు.

ఈ క్రమంలో తాజాగా ఐ ఆర్ సి టి సి రైల్వే టికెట్లు బుకింగ్ కు కూడా ఈఎంఐ అవకాశం కల్పించింది. ప్రస్తుతానికి స్టాండర్డ్ ఈఎంఐ విధానాన్ని మాత్రమే అమలు చేస్తున్నారు. త్వరలో నోకాస్టు ఈఎంఐ విధానం రైళ్లలో టికెట్ బుకింగ్ కు వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news