ఇండియాలో కొత్తగా 2,927 కరోనా కేసులు, 32 మరణాలు

-

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. మన దేశంలో మాత్రం కరోనా మహమ్మారి విజృంభణ క్రమ క్రమంగా తగ్గుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు 2927 నమోదయ్యాయి.


దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,65,496 కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2252 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 97.76 శాతంగా ఉంది.

ఇక దేశంలో తాజాగా 32 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,23,654 కి చేరింది. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,25,25,563 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,88,19,40,971 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 2197082  మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 16,279 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version