ఇండియాలో కొత్తగా 2538 కరోనా కేసులు, 60 మరణాలు

-

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు ఒకప్పటి కంటే.. ఇప్పుడు భారీగా తగ్గుతున్నాయి. మొన్నటి వరకు విపరీతంగా పెరిగిన కరోనా కేసులు.. ఇప్పుడు అమాంతం తగ్గి పోయాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 2538 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,01,477 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 30,799 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 86. 99 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 60 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,16,132 కి చేరింది.

ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,80,80,24,147 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 17,86,478 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2012 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,24,54,546 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news