ఇవాళ సాయంత్రం ముగియనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

-

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇక ఈ కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మరో 2 రోజుల్లో జరగనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్నీ రాజకీయ పార్టీలు ప్రచారంలో పాల్గొంటూ ఓటర్ మహాశయులను ప్రసన్నం చేసుకోవడానికి జోరుగా తిరుగుతున్నారు. ఇక ఇవాళ కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు ముగియనున్నాయి.

ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది. ఎల్లుండి కి పోలింగ్ షెడ్యూల్ అయింది. మొత్తం 224 నియోజకవర్గాలకు బుధవారం ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. 13వ తేదీన ఓట్ల లెక్కింపును చేపట్టనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఈ రోజు సాయం త్రానికి ప్రచారం ముగియనున్న నేపథ్యంలో చివరి రోజు అన్ని పార్టీలు.. తమ ప్రచార ఉధృతిని పెంచాయి. శని, ఆదివారాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరులో మెగా రోడ్ షో నిర్వ హించారు. ఇవాళ చివరి రోజు కావడం వల్ల అన్ని పార్టీలు తమ ప్రచార తీవ్రతను పెంచాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version