సోనియా గాంధీపై నగ్మా సంచలన వ్యాఖ్యలు

-

కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఆ పార్టీ సీనియర్ నేత, సినీనటి నగ్మ ఫైర్ అయ్యారు. రాజ్యసభ సీట్ల కేటాయింపు విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ సంచలన ట్వీట్ చేశారు. నేను పార్టీలో చేరినప్పుడు 18 ఏళ్ల క్రితం సోనియాగాంధీ రాజ్యసభ అవకాశం కల్పిస్తానని చెప్పారని, కానీ ఇప్పటివరకు ఆ అవకాశమే రాలేదా? అంటూ ప్రశ్నించారు. వచ్చే నెల 10వ తేదీన జరిగే రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఆదివారం పది మంది రాజ్యసభ సభ్యుల జాబితాను విడుదల చేసింది.

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కొంతమంది సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజ్యసభ సీటు ఆశించి భంగపాటుకు గురైన పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ట్విట్టర్ వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. దీంతో పవన్ ఖేరా ట్వీట్ కు నగ్మా స్పందిస్తూ.. నా 18ఏళ్ల తపస్సు కూడా ఇమ్రాన్ బాయ్ ముందు తక్కువైంది అంటూ పార్టీ అధిష్టానంపై విమర్శలు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news