బీజేపీ నేతల చిల్లర, చెత్త రాజకీయాలను ప్రజలు ఓడించారు: కేజ్రీవాల్

-

ఢిల్లీలోని రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి దుర్గేష్ పాఠక్ విజయం సాధించారు. పాఠక్ కు 40, 319 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి భాటియాకు 28, 851 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆప్ అభ్యర్థి 11,448 ఓట్లతో విజయం సాధించారు. ఈ విషయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హిందీ, ఇంగ్లీషు లో పలు ట్వీట్లు చేశారు.

” రాజేంద్రనగర్ ప్రజలకు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మాపై ఇంత ప్రేమ చూపిన ఢిల్లీ ప్రజలకు రుణపడి ఉంటాను. కష్టపడి పని చేసి, ఉత్తమ సేవలు అందించేందుకు మాకు ఇది స్ఫూర్తినిస్తుంది. బీజేపీ నేతల చిల్లర, చెత్త రాజకీయాలను ప్రజలు ఓడించారు. మంచిని గెలిపించారు. థాంక్యూ రాజేంద్రనగర్, థాంక్యూ ఢిల్లీ” అని తన ట్విట్టర్ లో కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news