అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ..పలు ప్రాంతాల్లో గొడవలు!

-

అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో భక్తులు ర్యాలీలు నిర్వహించి తమ భక్తిని చాటుతున్నారు. అయితే ఈ క్రమంలో పలుచోట్ల అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. ముంబైలోని మిరారోడ్డులో ఆదివారం ర్యాలీ నిర్వహిస్తున్న భక్తులపై దుండగులు దాడి చేశారు. గుజరాత్‌లొని ఖెరాలు పట్టణంలోనూ శోభాయాత్ర నిర్వహిస్తున్న వారిపై రాళ్లు రువ్వారు.

కాగా, రామ మందిర ప్రారంభోత్సవం అయిన తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక అయోధ్య లో కాల్పులు కర్ఫ్యూలు ఉండవని చెప్పారు 500 ఏళ్ల నాటి భారతీయుల కల నెరవేరుతుందని ఆదిత్య నాథ్ అన్నారు ప్రధాన సమాజం తమ దేవుడి కి సరైన స్థానం కల్పించడానికి ఇంత కష్ట పడాల్సి రావడం చరిత్ర లో మొదటిసారి అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version