నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం

-

భారత 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 76వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం జాతి నిర్దేశించి మొట్టమొదటిసారిగా ప్రసంగించనున్నారు. ఆమె ప్రసంగం రాత్రి ఏడు గంటలకు దేశవ్యాప్తంగా రేడియో( ఏఐఆర్) తోపాటు, దూరదర్శన్ అన్ని చానల్లలొ హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రసారం అవుతాయని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.

అనంతరం రాష్ట్రపతి ప్రసంగాన్ని దూరదర్శన్ ప్రాంతీయ చానల్లు ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తాయని వివరించింది. ఒడిశా కు చెందిన ద్రౌపది ముర్ము జూలై 25 వ తేదీన భారతదేశానికి తొలి గిరిజన రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news