తిహార్​ జైల్లో ఘర్షణ.. రోహిణి కోర్టు కాల్పుల ఘటన నిందితుడి హత్య

-

దేశ రాజ‌ధాని దిల్లీలోని తీహార్ జైల్లో ఇవాళ తెల్ల‌వారుజామున దారుణం జ‌రిగింది. ఇవాళ ఉదయం జైలులో ఖైదీల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఓ ఖైదీ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు ప్రకటన జారీ చేశారు. ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో దిల్లీలోని రోహిణి కోర్టు కాల్పుల ఘటన నిందితుడు టిల్లు తాజ్​పురియా హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. అతడి ప్రత్యర్థి యోగేశ్ అనే ఖైదీ తాజ్​పురియాను చంపినట్లు వెల్లడించారు.

అయితే ఘర్షణ జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లే వరకు తాజ్​పురియా తీవ్రంగా గాయపడి ఉన్నట్లు తెలిసింది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. గ్యాంగ్‌స్ట‌ర్ యోగేశ్‌తో పాటు అత‌ని అనుచ‌రులు తాజ్‌పురియాపై ఇనుప‌ రాడ్‌తో దాడి చేయ‌డంతో అత‌ను తీవ్రంగా గాయ‌ప‌డ్డాడని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news