ఈసీ సంచలన నిర్ణయం.. బెంగాల్ డీజీపీ సహా ఆరు రాష్ట్రాల్లో అధికారులపై వేటు..!

-

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న పోలింగ్ ముగియనుంది. ఇక జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఈ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం చాలా పగడ్బందిగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. పలు రాష్ట్రాల్లో అధికారులపై యాక్షన్ మొదలు పెట్టింది.

6 రాష్ట్రాల్లో అధికారులను తొలగిస్తూ ఈసీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జార్ఖండ్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్లో హోంశాఖ కార్యదర్శులను తొలగించింది. అలాగే పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ ని కూడా ఎన్నికల కమిషన్ తొలగించింది.
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన కొన్ని గంటల్లోనే ఎన్నికల కమిషన్ తీసుకున్న తొలి యాక్షన్ ఇదే. దేశ వ్యాప్తంగా ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆరు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులతో పాటు అదనంగా మిజోరం, హిమాచల్ ప్రదేశ్ లోని సాధారణ పరిపాలనా విభాగం కార్యదర్శులను కూడా తొలగించింది. ఇక పశ్చిమ బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)పై చర్యలు తీసుకుంది. బృహన్ ముంబై మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్, అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను
కూడా తొలగించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version