గుప్తనిధుల కోసం తండ్రినే బలి ఇవ్వబోయిన కుమారుడు

-

ఒడిశా కలహండిలో దారుణ ఘటన చోటుచేసుకుందిి.వృద్ధుడిని బలి ఇస్తే గుప్తనిధులు దొరుకుతాయనే నమ్మకంతో సొంత తండ్రినే హత్య చేసేందుకు ప్రయత్నించాడు ఓ యువకుడు.సమాచారం అందుకున్న పోలీసులు సకాలంలో స్పందించి వృద్ధుడిని రక్షించారు.నిందితుడిని అరెస్టు చేశారు.కలహండి జిల్లాలోని జైపట్నా బేలపాడ గ్రామానికి చెందిన లింగరాజ్ బోయ్(30) అనే యువకుడు చిన్న విషయాలకే తన తండ్రి బాలదేవ్ బోయ్ ని దారుణంగా హింసించేవాడు.దీంతో లింగరాజ్ భార్య కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది.వృద్ధుడిని బలి ఇస్తే గుప్త నిధులు లభ్యమవుతాయని ఓ పూజారి చెప్పాడు.

అది నమ్మిన లింగరాజ్ శుక్రవారం తన తండ్రిని బలిచ్చేందుకు సిద్ధమయ్యాడు.బావి వద్దకు తీసుకెళ్లి స్నానం చేయించి..కొత్త బట్టలు తొడిగించి పూలదండలు వేసి సిద్ధం చేశాడు.అనంతరం పూజారి ఇంట్లో బలి ఇవ్వడానికి పూజ ను ప్రారంభించాడు.ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా వారిపై ఇనుప రాడ్లు, గొడ్డళ్లతో లింగరాజ్ దాడి చేశాడు.అయితే పోలీసులు చాకచక్యంగా అతన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news