IPL 2023 : ఐపీఎల్‌ చరిత్రలో ఇదే తొలిసారి..ఒకే మ్యాచ్ లో రెండు సెంచరీలు

-

హైదరాబాద్‌ జట్టుపై బెంగళూరు జట్టు గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ జట్టుపై బెంగళూరు జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ జట్టు 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది. కానీ ఆ ల క్ష్యాన్ని బెంగళూరు ఆడుతూ పాడుతూ చేధించింది.

అయితే.. నిన్న జరిగిన SRH , ఆర్సిబి మ్యాచ్ లో మరో రికార్డు నమోదయింది. ఈ మ్యాచ్ లో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు సెంచరీలతో అదరగొట్టారు. గతంలో ఒక మ్యాచ్ లో ఒకే జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఓకే మ్యాచ్ లో ఇరుజట్లకు చెందిన ఆటగాళ్లు సెంచరీ చేయడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ లో ఆర్సిబి ప్లేయర్ కోహ్లీ 100, SRH ప్లేయర్ క్లాసిన్ 104 పరుగులు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version