విద్యార్థులకు బిగ్ అలర్ట్..నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష

-

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరుగనుంది. భారతదేశంలోని 23 ఐఐటీలలో బీటెక్ సీట్ల భర్తీ కోసం ఇవాళ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరగనుంది. భారతదేశ వ్యాప్తంగా ఏకంగా రెండు లక్షల మంది పోటీ పడుతుండగా.. మన తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 35 వేల మంది ఈ పరీక్ష రాయనున్నారు. ఇక ఈ పరీక్ష సమయం వివరాల్లోకి వెళితే… ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ -1 నిర్వహించనున్నారు అధికారులు.

అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటలకు పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు అధికారులు. ఇక ఈ నెల 18వ తేదీన ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈసారి 16,800 సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరుతున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news