విషాదం: పేలిన కొత్త ఎలక్ట్రిక్ బైక్.. తండ్రీకూతుళ్లు మృతి

-

చెన్నై: తమిళనాడు లోని వేలూరు చినఅల్లాపురం విషాదం చోటు చేసుకుంది. కూతురు కోసం కొన్న బైక్ యమపాశంగా మారింది. పేలుడు సంభవించి తండ్రి, కూతురు ఇద్దరు మృతి చెందారు. ఛార్జింగ్ లో ఉన్న బైక్ బ్యాటరీ పేలి ఈ దుర్ఘటన జరిగింది. వివరాలలోకి వెళ్ళితే..

 

దురై వర్మ తన కూతురు బడికి వెళ్లే క్రమం లో సౌకర్యవంతంగా ఉంటుందని రెండు రోజుల క్రితం ఎలక్ట్రిక్ బైక్ విక్రయించాడు. నిన్న రాత్రి ఇంట్లో ఛార్జ్ పెట్టి నిద్రుస్తున్న సమయంలో బ్యాటరీ పేలి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఎలెక్టిక్ బైక్ ఓవర్ ఛార్జ్ అయి బ్యాటరీ హీట్ అయి ఈ దుర్ఘటన జరిగి ఉండవచ్చని అక్కడి వారు అన్నారు. ఎలక్ట్రిక్ బైక్ పేలిన కొద్దీ క్షణాలలో వారు నిద్రుస్తున్న గది మొత్తం దట్టమైన పొగతో నిండి పోయిందన్నారు. ఆ గది లో నిద్రిస్తున్న తండ్రి, కూతురు ఊపిరి ఆడక చనిపోయినట్లు తెలిసింది. అయితే ఇంకా వారి కుటుంబ సభ్యుల కు సంబంధించి ఎలాంటి విషయాలు బయటకు రాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version