బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇంటికి కేంద్ర మంత్రి అమిత్ షా..

-

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు తన ఇంట్లో ఆతిథ్యం ఇవ్వబోతున్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం కోల్ కతా లోని తన నివాసంలో అమిత్ షా కు ఆతిధ్యం ఇవ్వబోతున్నారు. దీంతో సౌరవ్ గంగూలీ, అమిత్ షా కలయిక రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. గంగూలి బీజేపీలో చేరతారా? అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. నిజానికి గంగూలీని బిజెపిలో కి తేవాలని ఆ పార్టీ ఎప్పటి నుంచి ప్రయత్నిస్తోంది.

గత ఏడాది పశ్చిమబెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయనను పార్టీలోకి తేవాలని బీజేపీ ప్రయత్నించింది. బెంగాల్ లో బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వాలనుకున్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఆ సమయంలో గంగూలీ పార్టీలో చేరలేదు. అయితే గంగూలీ భార్య డోనా గంగూలీ శుక్రవారం కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో నాట్యం చేయబోతోంది. దీనికి అమిత్ షా హాజరవుతారు. ఈ కార్యక్రమం అనంతరం అమిత్ షా గంగూలీ నివాసానికి వెళ్తారు. అమిత్ షా తో పాటు పలువురు బెంగాల్ బీజేపీ నేతలు కూడా గంగూలీ నివాసానికి వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news