ఆ ఓటీటీకి ‘వాల్తేరు వీరయ్య’ డిజిటల్‌ రైట్స్

-

మెగాస్టార్ చిరంజీవి ఇవాళ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘గ్యాంగ్‌లీడర్‌’, ‘ఘరానా మొగుడు’ సినిమాల ఛాయలు పోస్టర్‌లు, ట్రైలర్‌లలో కనిపించడంతో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. పైగా మాస్‌ మహరాజా రవితేజ ఈ సినిమాలో కీలకపాత్ర పోషించడంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం రిలీజై పాజిటీవ్‌ రివ్యూలు తెచ్చుకుంది. ఈ సినిమా హక్కులను ఓ బిగ్‌ ఓటీటీ సంస్థ దక్కించుకుందట.

ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. తెలుగుతో పాటు హిందీ హక్కులను కూడా కొనుగోలు చేసిందట. కాగా ఈ సినిమాను 6 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయాలని వీరయ్య బృందం నెట్‌ఫ్లిక్స్‌ సంస్థతో డీల్‌ కుదిరించుకుందట. ఈ లెక్కన చేసుకుంటే మార్చిలో ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో చిరుకు జోడీగా శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటించింది. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రీ సంస్థ నిర్మించింది.

Read more RELATED
Recommended to you

Latest news